ఈ మధ్యకాలంలో మహిళలపై ఉన్మాదపు దాడులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైనా సంగతి అందరికి తెలిసిందే.హైదరాబాద్ లో మధులిక అనే ఇంటర్ విద్యార్ధిని భరత్ అనే యువకుడు దాడి చేసిన సంఘటన అందరికి తెలిసిందే.
అలాగే గుంటూరు మంగళగిరిలో శ్రీనివాస్ అనే యువకుడు, ప్రేమించిన జ్యోతి అనే యువతి ప్రేమించి, పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో తన స్నేహితులతో కలిసి ఆమెని హతమార్చి, దానిని ఎవరో చేసినట్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేసాడు.ఈ సంఘటన మరిచిపోక ముందే గుంటూరు జిల్లా తెనాలిలో మరో దారుణం వెలుగుచూసింది.
తెనాలిలో ఇస్లాంపేటలో జ్యోతి అనే యువతీని సత్యనారాయణ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేసాడు.సత్యానారాయణతో ఆమె సహజీవనం చేసినట్లు తెలుస్తుంది.అయితే జ్యోతి కొంత కాలంగా వేరొక వ్యక్తితో చనువుగా వుండటంతో సత్యనారాయణ, జ్యోతి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది.దీంతో ఇద్దరు విడిపోయారని తెలుస్తుంది.అయితే జ్యోతి ఇంట్లో ఎవరు లేని సమయం చూసిన సత్యనారాయణ లోపలి వెళ్లి ఆమెతో గొడవ పడి తరువాత గొంతు కోసి చంపేసి అక్కడి నుంచి పరారయ్యినట్లు తెలుస్తుంది.విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, నిందితుడు సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు.