ఇద్దరూ కావాలన్న పెళ్లయిన ప్రేయసి…ఇద్దరు ప్రియులు ఆ పని చేసారు.! ఇలాంటివారిని ఏం చేయాలి.?

అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న జీవిత భాగ‌స్వామిని మోసం చేస్తూ ఇత‌రుల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకునేందుకు నేటి త‌రుణంలో కొంద‌రు దేనికీ వెనుకాడ‌డం లేదు.అవ‌స‌రం అనుకుంటే ఆ జీవిత భాగస్వామిని కూడా త‌మ అక్ర‌మ సంబంధం కోసం అంత‌మొందిస్తున్నారు.

 Women Killed By Her Two Lovers-TeluguStop.com

ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి.అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.

వివరాల లోకి వెళ్తే…

పాంచాలీనగర్‌కు చెందిన అనూషకు 27 సంవత్సరాలు.ఆమె డిగ్రీ చదివి సమయంలో ఇద్దరు లవర్స్ ఉన్నారు.

సంవత్సరం క్రితమే అనూషకు వివాహమయ్యింది.అయినా ప్రియుళ్ళను మాత్రం మరిచిపోలేదు.

భర్తతో కలిసి ఉంటూనే ఇద్దరు ప్రియుళ్లు సూరి, రాములు తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తుండేది.

ఇటీవలే సూరి, రాములు పూటుగా మద్యం సేవించి గొడవపడ్డారు.అనూషతో ఎవరో ఒకరు కలిసి ఉండాలి.ఇద్దరూ కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నారు.

దీంతో అనూషను రేణిగుంటలోని ఒక నిర్మానుష్యమైన అపార్టుమెంటుకు తీసుకెళ్ళారు.ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోమని పట్టుబడ్డారు.

తనకు ఇద్దరూ కావాలంటూ అనూష చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు.రాము, సూరిలు ఇద్దరూ కలిసి అనూషను చంపి అపార్టుమెంట్‌లో ఉరివేసుకుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube