ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ చూసిన ఆడవాళ్ళ మీద అత్యాచారాల పర్వం వెలుగు చూస్తూనే వున్నాయి.చిన్నవాళ్ళపై కూడా మృగాళ్ళ దూరాగాతాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది.
ఒంటరిగా దొరికే ఆడపిల్లని మాటు వేసి కాటు వేయడం పరిపాటిగా మారింది.మరో వైపు కొంత మంది ప్రేమ పేరుతో ఆడవాళ్ళని టార్గెట్ గా చేసుకొని లొంగదీసుకొని దారుణాలకి పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా తమిళనాడులో అలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది.
ప్రేమ పేరుతో అమ్మాయిలని ట్రాప్ చేసి అత్యాచారం చేసి, వారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతాం అంటూ బెదిరించే ఓ గ్యాంగ్ గుట్టు రట్టయింది.
తమిళనాడులో సుమారు రెండు వందల మంది విధ్యార్దినిలు ఈ ముఠా దాడులకి బలినట్లు తెలుస్తుంది.కోయంబత్తూరు జిల్లాలో తిరునావుక్కరుసు ప్రాంతానికి చెందిన వారు ఈ ముఠాలో వున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇప్పటికే ఈ ముఠాలో కీలక వ్యక్తులని అరెస్ట్ చేసిన పోలీసులు వీరు చేసిన దురాగతాలు అలాగే వీరి ముఠాలో మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నంలో వున్నట్లు తెలుస్తుంది.