సమాజంలో మహిళల మీద అరాచకం, వేదింపులు, హింస ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.ఓ వైపు మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని అంటున్న ప్రభుత్వాలు వారిపై జరిగే ఆక్రుత్యాలని నియంత్రించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.
ఒంటరి మహిళ అంటే సమాజంలో వేదింపులు, కుటుంబంలో వేదింపులు సర్వసాధారణం అయిపోయాయి.అసలు విషయంలోకి వెళ్తే అత్తింటి వారు ఓ కోడలిని హింసించి, వేధించి ఆమె బట్టలు చింపేసి నగ్నంగా మార్చేసారు.
అయితే బాధిత మహిళ అలా నగ్నంగానే పోలీస్ స్టేషన్ కి అత్తింటి వారిపై ఫిర్యాదు చేసింది.ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.
రాజస్థాన్లోని చురూ జిల్లాకి చెందిన వ్యక్తితో మహారాష్ట్రకు చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది.భర్తేమో పని కోసం అసోం వెళ్లాడు.ఈ క్రమంలో సదరు మహిళపై చివరికి ఆమె బట్టలు చింపేశారు.తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే వెళ్లింది.
ఆమెకు పోలీసులు రక్షణ కల్పించి ఫిర్యాదును స్వీకరించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.
ఆమె నడిరోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే కొందరు ఫోటోలు తీశారు.అయితే రోడ్డు వెంట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు తొలగించారు.
అలాగే ఫోటోలు తీసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేసారు.