కాలం మారుతుంది కానీ మనుషులు మాత్రం మారడం లేదు.నోటి వరకు మాత్రమే వరకట్నం వద్దు అది ఇది అని అంటున్నారు.
నిజ జీవితంలోకి వస్తే ఇంకా వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.ఇంకా ఇప్పడు కూడా తాడికొండ మండలం ముక్కామలలో శుక్రవారం ఓ ఘటన చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన అలా శ్రీవాణికి తాడికొండ మండలం ముక్కామల గ్రామానికి చెందిన దానబోయిన వెంకటకృష్ణతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది.
పెళ్లి జరిగిన సమయంలో కట్నంగా మూడు సెంట్ల స్థలం, ఒకటిన్నర ఎకరం పొలం, కొంత బంగారం ఇచ్చారు.
అయితే ఏమైందో తెలియదు గత మూడు నెలలుగా శ్రీవాణి భర్త, అత్త, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారు.
అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్రీవాణి ఇంటి నుండి వెళ్లిపోయింది.దీంతో ఆమె కోసం గ్రామంలో గాలించగా ఊరి చెరువులో మృతదేహం కనిపించింది.
కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరుకు తరలించారు.