ఇటీవల కాలంలో అబ్బాయిలు ఎంత మోసపోయిన సరే అసలు బుద్ధి రావట్లేదు.అందంగా ఉంటే చాలు అమ్మాయిలకు లక్షలు లక్షలు పోస్తున్నారు.
ఇక ఈ ఫేస్ బుక్, వాట్సాప్, మ్యాట్రిమోని సైట్స్ వచ్చాక మరీ దారుణంగా తయారయ్యారు.కనీసం అమ్మాయిని కలిసి కూడా ఉండరు.
ఎవరో అమ్మాయి ఫోటోలు చూసి వారే అనుకుని తెగ మాట్లాడేస్తున్నారు.మాటలతో ఆగకుండా.
గుణం గురించి తెలుసుకోకుండా ప్రేమ అనే మాయలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికి ఎంతోమంది మోసపోయారు.
తరచూ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నా అబ్బాయిలు మాత్రం అందాన్ని చూసి మోసపోతున్నారు.ఇక అలానే ఇప్పుడు కూడా ఒక అబ్బాయి పైన ఉన్న అమ్మాయ్ ఫోటో చూసి మోసపోయాడు.
నిజంగానే అమ్మాయి భలే ఉంది కదా.కానీ ఆ అబ్బాయ్ మాట్లాడింది ఆ అమ్మాయితో కాదు.ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తితో మాట్లాడాడు.అందంగా ఉన్న ఈ అమ్మాయి ఫోటోలు తీసి ఆ పెళ్లికొడుకుకు రోజుకో ఓ ఫోటో పంపేవాడు.
అది నిజం అని నమ్మిన పెళ్లికొడుకు ఆ అమ్మాయ్ మాయలో పడి బాగా కనెక్ట్ అయ్యాడు.ఇంకేముంది అడిగినంత డబ్బు ఇచ్చేశాడు.
ఆ డబ్బు తీసుకున్న మోసగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు.ఇటువైపు తల్లితండ్రులకు ప్రేమ గురించి చెప్పగా ఆమె అడ్రెస్ పట్టుకొని వెళ్లిన తల్లితండ్రులకు షాక్ తగిలింది.
ఎందుకంటే ఆ పేరుతో అక్కడ ఎవరు లేరు.దీంతో మోసపోయా అని భావించిన ఆ యువకుడు పోలీస్ కేసు పెట్టగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధారంగా వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం మోసపోయిన అబ్బాయ్ భారత్ నుంచి అమెరికాకు వెళ్లినట్టు.పెళ్లి కోసం అని ఓ ప్రముఖ మ్యాట్రిమోనల్ సైట్స్ లో చూడగా ఆ సమయంలోనే ఈ సైబర్ క్రైం కి చిక్కి మోసపోయాడు.
ఏది ఏమైనా.ఇలాంటి అమాయకులు ఉన్నంత కాలం ఇలా మోసాలు జరుగుతూనే ఉంటాయి.