మామూలుగా కొంత మంది అభిమానులకి సెలబ్రిటీలు వాడేటువంటి వస్తువులపై మక్కువ ఎక్కువగానే ఉంటుంది. దీంతో తమకు ఇష్టమైన సినీ సెలబ్రిటీలు వాడి నటువంటి వస్తువులను అమ్ముతున్న లేదా వేలం వేస్తున్నా పోటీపడి మరీ డబ్బు వెచ్చించి కొనుక్కుంటుంటారు.
కాగా తాజాగా ఓ మహిళ కూడా ఓ ప్రముఖ హీరో గుర్రం అమ్ముతారని చెప్పడంతో కొనుక్కునేందుకు లక్షల రూపాయలను వెచ్చించింది.కానీ చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని జైపూర్ పరిసర ప్రాంతంలో సంతోష్ భాటి అనే మహిళ తన కుటుంభం సభ్యులతో కలసి నివాసం ఉంటుంది.అయితే ఈమెకు సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులు లేదా పురాతన వస్తువులను కొనడానికి కొంతమేర ఆసక్తి ఉండేది.
దీంతో అప్పుడప్పుడు సంతోష్ భాటి సెలబ్రిటీలు వాడిన వస్తువుల వేలం పాటలకు కూడా హాజరు అయ్యేది. అయితే తాజాగా ఓ ముగ్గురు వ్యక్తులు తమ వద్ద బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉపయోగించిన గుర్రం ఉందని ప్రస్తుతం తమకు డబ్బులు అవసరం ఉండటంతో ఈ గుర్రం అమ్ముతున్నట్లు చెప్పడంతో సంతోష్ భాటి ఏమాత్రం ఆలోచించకుండా గుర్రం కోసం 12 లక్షలు డబ్బులు చెల్లించింది.
దీంతో డబ్బులు తీసుకున్న వ్యక్తులు వారం రోజుల తర్వాత గుర్రాన్ని అప్పగిస్తామని చెప్పడంతో అందుకు కూడా అంగీకరించింది.కానీ వారం రోజుల పూర్తయినప్పటికీ గుర్రాన్ని అప్పగించడంతో అనుమానం వచ్చి గుర్రం కోసం తన దగ్గర తీసుకున్న వ్యక్తులకు ఫోన్ చేసింది.
కానీ ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది.ఇంకేముంది విషయం అర్థం చేసుకుని తాను మోసపోయానని గ్రహించింది.
అనంతరం దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన గోడును వెల్లబోసుకుంది. అంతేగాక ఎలాగైనా తన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరింది.
దీంతో సంతోష్ భాటి తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.