దేశంలో కరుణ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ పాటించిన అనంతరం ఉన్నట్లుండి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా పోలీసులు బయట తిరుగుతున్నటువంటి ప్రజలపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.
తాజాగా బయట కారులో తిరుగుతున్నటువంటి ఓ యువతిని పోలీసులు ఆపి లాక్ డౌన్ సమయంలో ఇలా బయట తిరుగుతున్నావెంటని ప్రశ్నించగా ఆమె పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసింది.ఈ దాడిలో భాగంగా కానిస్టేబుల్ చెయ్యిని దారుణంగా కొరికింది.
ఈ ఘటన దేశంలోని కోల్కతా నగరంలో చోటు చేసుకుంది.అయితే క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ఇలా క్రూరంగా ప్రవర్తించినటువంటి యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తమై పోలీస్ స్టేషన్ తరలించారు.
అయితే ఇలా పోలీసులపై దాడి చేయడం ఒక్క కోల్కతానగరంలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి.ఇందులో ముఖ్యంగా పట్టణాల్లో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
అయితే వీటికి కొందరు మద్దతిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రజలకి నిరంతరం రక్షణ కల్పిస్తున్న పోలీసులపై ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఉన్నట్లుండి చెప్పాపెట్టకుండా లగ్నం కార్యక్రమం పేరుతో వ్యవస్థను ఇక్కడికి అక్కడికే పరిమితం చేయడంతో చిన్నచిన్న అవసరాలకు బయటికి రావడం తప్ప లేదు అంటున్నారు.
అంతేగాక ఇప్పటికే పనుల నిమిత్తమే పట్టణాల్లో నివసిస్తున్నటువంటి గ్రామాలకి చెందిన ప్రజలను తమ ఇళ్లకు సురక్షితంగా చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.