దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు.అయితే తాజాగా ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి యత్నించగా ఎదురు ఎదురు దాడి చేసినటువంటి మహిళ ఓ వ్యక్తి నాలుకను దారుణంగా కొరికిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని జల్పాయ్ గురి అనే ప్రాంతంలో ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది.అయితే మొన్నటి రోజున దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ ని పాటించాలంటూ పిలుపునిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఇందులో భాగంగా మహిళ కూడా ఇంటిలోనే ఒంటరిగా ఉంది.అయితే ఎన్నో రోజులుగా ఆమె పై కన్నేసినట్టు వంటి స్థానిక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఇదే అదునుగా భావించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఇందులో భాగంగా మహిళ ఉన్నటువంటి ఇంటిలోకి వెళ్లి ఆమెను బలవంతంగా ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె ఎదురు దాడి చేసింది.ఇందులో భాగంగా తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన యువకుడి నాలుకను రెండుగా కొరికేసింది.
దీంతో యువకుడు లబోదిబోమంటూ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పరుగులెత్తాడు.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళను అదుపులోకి విచారించగా ఈ విషయం బయటపడింది.
అలాగే బాధితుడు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.