వాట్స్ అప్ లు వచ్చాక యువత వీడియో చాట్ లు చేస్తూ టైం వెస్ట్ చేసుకుంటున్నారు అని చాలా మంది భావిస్తున్నారు.ఈ వీడియో చాట్ లతో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ కనిపిస్తూ ఈ టెక్నాలజీ ని దుర్వినియోగం చేస్తున్నారు.
అయితే ఈ టెక్నాలజీ సరైన వారి చేతిలో ఉంటె ఎంతగా ఉపయోగపడుతుందో ఈ తాజా ఉదంతం గురించి తెలుసుకుంటే మీకు అర్ధం అవుతుంది.ముంబై రైల్వేస్టేషన్ లో ఒక యువతి తన స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఏవేవో సైగలు చేస్తుంది.
అయితే ఆది చూసిన చాలా మంది ఎదో టిక్ టాక్ వీడియో నో,లేదా పక్కవారికి వినపడకుండా స్నేహితులకు సైగలు చేస్తూ చెబుతుంది అని అనుకున్నారు.కానీ తరువాత విషయం అర్ధం అయ్యింది.కానీ అమెకు మాటలు రావని, అమె బదిర యువతి అని మాత్రం తెలియదు.చెవులుండీ వినపడక,నోరుండీ మాటలు రాక బదిరులు గా మిగిలిన వారి చేతికి ఈ టెక్నాలజీ వస్తే ఏమి జరుగుతుంది అన్నది ఆ యువతి చూపించింది.
తనలాంటి స్నేహితులతో ఆ యువతి వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ అలా సైగలు చేసినట్లు అర్ధం అయింది.
ఇదే దృశ్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో షూట్ చేసి ఇన్స్టాగ్రాం లో పోస్ట్ చేస్తూ “టెక్నాలజీ నీకు ధన్యవాదాలు.
ఇన్నాళ్లు వీడియో కాలింగ్ యాప్లు కేవలం యువతకే అనుకున్నా, కానీ ఈ రోజూ దాని ఉపయోగం ఏంటో చూశా” అంటూ కామెంట్ కూడా రాశాడు.దీనితో ఇప్పుడు ఆ వీడియో కు విపరీతమైన లైక్ లు షేర్ లు లభిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది
.