దేశంలో రోజురోజుకూ దారుణాలు పెరిగి పోతున్నాయి.పాపం పుణ్యం తెలియని అమాయక యువతులపై వరసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా జరిగిన ఒక సంఘటన వింటేనే కళ్ళ వెంట నీళ్లొస్తాయి.అలాంటి దారుణమైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
ఒక నలుగురు వ్యక్తులు చేసిన పనికి అసలు ఈ దేశం ఎటుపోతుందో అని అనిపిస్తుంది.
నలుగురు వ్యక్తులు కలిసి ఒక యువతిని ఎవరూలేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు.
ఆ యువతిని బట్టలు విప్పేసి, ఒక చెట్టుకు కట్టి, సగం గుండు చేసి తర్వాత కట్లు విప్పేసి ఆమె బట్టలతో సహా అక్కడి నుండి పారిపోయారు.ఆ యువతి అక్కడి నుండి రోడ్డుకు చేరుకొని అక్కడ స్పృహ తప్పి పడిపోయింది.
ఆమెను చుసిన కొంతమంది ఆసుపత్రిలో చేర్పించారు.పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విచారిస్తున్నారు.
ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు.
ముంబై ప్రాంతానికి చెందిన 26 సంవత్సరాల యువతిని నలుగురు వ్యక్తులు చేరుకురసం ఇప్పిస్తానని చెప్పి ఎవరూలేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడకు తీసుకెళ్లిన తర్వాత ఆ యువతిని ఒక చెట్టుకు కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేసారు.తర్వాత ఆమె బట్టలు మొత్తం విప్పేసారు.నగ్నంగా చేసిన తర్వాత ఆమె కు సగం గుండును చేసారు.అంతేకాదు ఈ ఘటన మొత్తం ఫోన్లో వీడియో తీశారు.
ఎవరికైనా చెబితే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతామని ఆమెను బెదిరించారు.
తరువాత ఆమె కట్లు విప్పేసి ఆ నలుగురు ఆమె బట్టలతో సహా అక్కడి నుండి పారిపోయారు.
ఆమె అక్కడి నుండి తప్పించుకుని రోడ్డుకు చేరుకుంది.అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె స్పృహ తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోయింది.
అటుగా వెళ్తున్న వారు ఆమెను చూసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.తర్వాత పోలీసులకు ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకొని ఆమెను విచారించారు.
ఆ యువతి పోలీసులకు జరిగిందంతా జరిగిందంతా చెప్పడంతో పోలీసులు ఆ నలుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసారు.ఆ నలుగురిలో ఒక మహిళ కూడా ఉందని ఆ యువతి పోలీసులకు చెప్పింది.
అందులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు.మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటన ఆమెను షాక్ కు గురిచేసిందని ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మరింత సమాచారం సేకరిస్తామని పోలీసులు తెలిపారు.