అమ్మాయిలకు గరిట పట్టుకోవడమే కాదు.తేడా వస్తే గరిటను మలిపి నాలుగు తగిలించడం కూడా తెలిసుండాలి అంటారు పలువురు.
ఇప్పుడిప్పుడే అలాంటి అమ్మాయిలు బయటకు వస్తున్నట్లు ఉన్నారు.అవును ఇలాంటిదే ఈ వార్త.
ప్రేమించుకున్న ఒక జంట సొంతుళ్లను వదిలి వేరే దగ్గరకు పోయి స్థిరపడ్డారు.కొన్నాళ్లకు ప్రియుడు ఆమెను దూరంగా పెట్టడం మొదలు పెట్టాడు.
అలాగే ఇంకో అమ్మాయితో చనువుగా ఉండటం ప్రారంభించాడు.దీన్ని గమనించిన ప్రియురాలు ఆగ్రహంతో ఊగిపోయింది.
ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి పోతే.
తన ప్రియుడు తప్పించుకు తిరుగుతున్నాడని ఆగ్రహంతో రగిలిపోయిన ప్రియురాలు యాసిడ్తో దాడి చేసింది.త్రిపురలోని అగర్తలాకి చెందిన బినాటా సంతల్(27), సోమన్(30) పక్కపక్క ఇళ్లలో ఉండేవారు.
వారు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.సోమన్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు.
పూణెకు వెళ్లి అక్కడ పనిచేసుకుంటూ కొన్ని రోజులు ఉన్నారు.ప్రియుడు సంపాదించకున్నా.
సంతల్ పలుచోట్ల పనిమనిషిగా ఉంటూ అతన్ని పోషించింది.
కొన్ని రోజులకు సోమన్కి ప్రైవేట్ జాబ్ వచ్చింది.
దాంతో అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది.ఇక 2018లో సోమన్ తిరిగి సొంతురికి వచ్చేశాడు.
సంతల్ ను రోజురోజుకూ దూరం పెట్టడం మొదలుపెట్టాడు.నెమ్మదిగా మాట్లాడటం కూడా మానేశాడు.
మూడు నెలల్లోనే ఆమెను పూర్తిగా మర్చిపోయాడు.ఈ ఏడాది ఆగస్టులో ఊరికి తిరిగొచ్చిన సంతల్ కు ఎంత వెతికినా సోమన్ ఆచూకీ దొరకలేదు.
దాంతో సంతల్ రాంచీ వెళ్లి హెల్త్కేర్ సంస్ధలో చేరింది.
దుర్గాపూజ సందర్భంగా సోమన్ ఊరికి వస్తున్నాడని తెలుసుకుని తనుకూడా వచ్చేసింది.
తనను పెళ్లి చేసుకోవాలని కోరింది.దానికి సోమన్ నిరాకరించడంతో కోపంతో రగిలిపోయింది.
అలాగే అతను ఇంకో అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని తెలుసుకుని కోపంతో ఊగిపోయింది.కోపాన్ని తట్టుకోలేక ప్రియుడిపై యాసిడ్ పోసేసింది.
అయితే సోమల్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.