ఇక్కడ ఒక కూతురు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.మామూలుగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఇక్కడ కూతురు మాత్రం తన తల్లి చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ బెడ్రూంలో తల్లి శవాన్ని దాచిపెట్టి నాటకాలు ఆడుతుంది.చివరికి దుర్వాసన రావడంతో స్థానికులు అందరూ నిలదీయగా అసలు విషయం బయటపడింది.
ఈ దారుణ ఘటన బెంగాల్ హుగ్లీ ప్రాంతం శ్రీరాంపూర్ లో వెలుగులోకి వచ్చింది.
చనిపోయి దాదాపు మూడు రోజులు అవుతుంది… కూతురు శవానికి అంత్యక్రియలు జరపలేదు.
సోనాలి రాయ్ అనే మహిళ తల్లి సుష్మ రాయ్ ఇటీవలే కన్నుమూశారు.ఇక తల్లికి అంత్యక్రియలు జరుగకుండా బయట ఎవరికీ ఈ విషయం చెప్పకుండా కూతురు సోనాలి తల్లి శవాన్ని బెడ్ రూమ్ లో దాచి పెట్టింది.
మూడు రోజులు గడిచిపోయింది.
ఇక ఆ తర్వాత శవం కుళ్లిపోయి దుర్వాసన రావడం మొదలైంది.
చుట్టుపక్కల వారందరికీ అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా బెడ్రూంలో సోనాలి తల్లి మూడు నాలుగు రోజుల క్రితం చనిపోయిన మృతదేహం కనిపించింది.మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
కూతురు సోనాలి ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,
.