సమాజంలో రోజు రోజుకు మహిళలపై అరాచకాలు పెరిగి పోతున్నాయి అనడానికి లోకంలో జరిగే ఎన్నో సంఘటనలు, దారుణాలు ఉదాహరణగా చెప్పవచ్చూ.ఇక ఎవరికైన కష్టం వస్తే పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కుతారు.
కానీ అక్కడున్న పోలీసులకే కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు.
అందులో మహిళా పోలీసుల భాధలు అయితే ఒక్కోసారి చెప్పుకోవడానికి కూడా వీలుపడదు.
నిజమే మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్న అవి నేరస్దులకు చుట్టాలుగా ఉంటున్నాయట.ఇకపోతే ఓ మహిళా ఎస్సై వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్ ఎస్ఎస్పీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.యూపీకి చెందిన 30 ఏళ్ల అర్జూ పవార్ అనే మహిళ, అనూప్షహర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో 2015 నుంచి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోందట.
కాగా ఆమె షామ్లి జిల్లాలో ఒంటరిగా నివసిస్తోందట.అయితే ఆమె గత కొంత కాలంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటుందట.
ఇక మానసికంగా కృంగిపోయిన ఈ మహిళ తను నివాసం ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడిందట.ఈమె మరణానికి కారకులు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదట పోలీసులు.