కొంతమంది తెలివి చూసి ఒక్కోసారి నవ్వాలో జాలిపడాలో తెలియదు.వారు చేసే పనికి ఒక్కోసారి వారికే నష్టం కలిగితే, మరి కొన్నిసార్లు ఇతరులకు నష్టం వాటిల్లుతుంది.
తాజాగా తమిళనాడులో ఓ మహిళ చేసిన పనికి ఆమె తెలివికి కొందరు నవ్వుకుంటుంటే, మరికొంత మంది ఆమె అతితెలివే ఆమె కొంప ముంచిందని అంటున్నారు.
తమిళనాడులోని రాశిపురం విఘ్నేశ్నగర్కు చెందిన కళాదేవి తన ఇంట్లో దొంగలు పడతారేమోననే సందేహంతో ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షల విలువ చేసే బంగారాన్ని పాతపేపర్లు ఉన్న చోట పేపర్లో చుట్టు దాచింది.ఒకవేళ దొంగలు పడితే వారు పాతపేపర్లు ఎత్తుకెళ్లరు కదా అని ఆమె ఆలోచించింది.
అయితే ఇదే తెలివి ఆమె కొంప ముంచింది.ఓ రోజు పాతసామాన్లు అమ్మే క్రమంలో పాతపేపర్లు కూడా ఆమె అమ్మేసింది.
కాసేపటికి అందులో బంగారం దాచిన సంగతి గుర్తొచ్చి లబోదిబోమంటూ పాతసామాన్లు కొనే వ్యక్తి కోసం వెతికింది.అయితే అప్పటికే అతడు మాయం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని పాతసామాన్లు కొనే వ్యక్త అతికష్టంపై పట్టుకున్నారు.అతడి వద్ద ఉన్న బంగారం స్వాధీనం చేసుకుని కళాదేవీకి తిరిగి ఇచ్చేశారు.తన బంగారం తనకు దొరికిన ఆనందంలో అతడికి పదివేల బహుమతి కూడా ఇచ్చింది ఈ మహాతల్లి.ఏదేమైనా అతితెలివికి పోయి బంగారం పోగొట్టుకున్న కళాదేవిని చూసి పలువురు నవ్వుకుంటున్నారు.