మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే.జనసేన అధినేత జగనన్న అంటూన్నారేంటి అనే కదా మీ డౌట్.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ వాడి వేడిగా ప్రసంగాలు, పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు.
దీనిలో భాగంగానే ప్రజలతో మమేకం అవుతూ వారితో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.తాజాగా చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు.
అయితే అక్కడ ఆయనకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది.
ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు.
ఓ మహిళ తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ జనసేన అధినేత జగనన్నకు నమస్కారం అని అనడంతో జనసేన కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనాల్సింది పొరపాటున ఆమె జగనన్న అని అనడంతో అంతా షాక్ అయిపోయారు.తన సభలో సీఎం జగన్ ప్రస్తావన రావడంతో పవన్ కల్యాణ్ కూడా షాక్ అయ్యారు.
కొద్ది సేపటి దాకా ఆయన తేరుకోలేదు.వెంటనే స్పందించిన జనసేన కార్యకర్తలు ఇది వైసీపీ కాదమ్మా అంటూ గట్టిగా కేకలు వేయడంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది.