ప్రమాదం అనేది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు.దేశంలో ఊహించని ప్రమాదాల వల్లే వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే సమయస్పూర్తితో వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రాణాలు కాపాడుకోవడం సాధ్యమవుతుంది.కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగితే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మనల్ని మనం కాపాడుకోవడం లేదా అవతలి వ్యక్తులకు కాపాడటం సాధ్యమవుతుంది.
తాజాగా ఒక మహిళ ప్రాణాలు కాపాడటమ్ కోసం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని వార్తల్లో నిలిచింది.కట్టుకున్న చీరను విప్పి కాలువలో కొట్టుకుపోతున్న బాలుడిని రక్షించింది.మహిళ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎడమకాలువ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అరుణ్ దొడమని అనే ఆరు సంవత్సరాల బాలుడు నిన్న ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడు.
షకీనాబేగం రజాసాబ అనే మహిళ ఆ సమయంలో అక్కడి బట్టలు ఉతుకుతోంది.
బాలుడు కాలువలో పడటం చూసిన మహిళ గట్టిగా కేకలు వేసింది.ఆ కేకలు విని మహేష్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
మహేష్ కు విషయం తెలిసినా తనకు కూడా ఈత రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.షకీనాబేగం తక్షణమే స్పందించి తన చీరను ఉపాధ్యాయునికి ఇచ్చి బాలుడిని కాపాడాలని పేర్కొంది.
ఉపాధ్యాయుడు ఆ చీర సహాయంతో బాలుడిని కాపాడాడు.అనంతరం షకీనా, మహేష్ బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.ఆ తర్వాత ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి బాలుడికి చికిత్స అందేలా చేశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా షకీనా బేగం సమయస్పూర్తికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని బాలుడి ప్రాణాలు కాపాడినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.