వైద్యుల నిర్లక్ష్యానికి మరో వివాహిత బలైంది.ఎదో జలుబు చేసింది కదా అని సంగారెడ్డి జిల్లా,గొర్రెకళ్లు గ్రామానికి చెందిన స్వాతి(18) అనే వివాహిత హైదరాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్ళింది.
అయితే అక్కడి వైద్యుల నిర్లక్ష్యానికి ఆ మహిళ చివరికి ప్రాణాలు కూడా కోల్పోవలసి వచ్చింది.ఈ ఘటన హైదరాబాద్ లోని కాచి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం….స్వాతి కి అదే జిల్లా కల్ప గూర్ గ్రామానికి చెందిన సుంకరి నవీన్ కుమార్ తో ఈ ఏడాది జూన్ లోనే వివాహం జరిగింది.
అయితే ఇటీవల స్వాతికి బాగా జలుబు చేయడం తో పాటు టాన్సిల్స్ కూడా ఇబ్బంది పెడుతుండడం తో హైదరాబాద్ కాచిగూడ లోని సీసీ షారఫ్ ఆసుపత్రి కి భర్త నవీన్ తో కలిసి వెళ్ళింది.అయితే అక్కడ పేషెంట్స్ ఎక్కువగా ఉండటంతో చైతన్యపురిలోని తన క్లినిక్కి రావాలని అక్కడి వైద్యుడు సూచించడం తో భర్త నవీన్ స్వాతిని తీసుకొని ఆ ఆసుపత్రికి వెళ్ళాడు.
అనంతరం అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు టాన్సిల్స్ సర్జరీ చేసి తొలగించాలని డాక్టర్స్ తెలిపారు.దీనితో కాచిగూడ లోని ఆసుపత్రిలో సర్జరీ చేసి తొలగిస్తామని తెలపడం తో గురువారం భర్త నవీన్ తో కలిసి స్వాతి తిరిగి షారఫ్ ఆసుపత్రికి వెళ్ళింది.
అయితే కాసేపటి తరువాత ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లిన వైద్యులు మధ్యాహ్నం 3 గంటలు అయినా బయటకు తీసుకురాకపోవడం తో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డాక్టర్ ని నిలదీయడం తో ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదని తెలిపి, సాయంత్రం 6గంటల సమయంలో స్వాతి మృతి చెందింది అంటూ కుటుంబ సభ్యులకు తెలిపారు.దీనితో ఒక్కసారిగా దిగ్భ్రాంతి కి గురైన స్వాతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
స్వాతి మృతి చెందిన వార్తను తెలిపిన వైద్యులు నిదానంగా ఆ ఆసుపత్రి నుంచి జారుకున్నారు.కేవలం జలుబు కారణంగా ఆసుపత్రికి వచ్చిన తన భార్య మృతికి డాక్టర్.
రామకృష్ణ,అనస్తీసియా స్పెషలిస్ట్ డా.మల్లి ఖార్జున లే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు.