ప్రస్తుత సమాజంలో చాలా మంది వావి వరసలు మరిచి పోతున్నారు.కాసేపటి సుఖం కోసం కట్టుకున్న భర్తను కాటికి పంపుతున్నారు.
ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేస్కుంటుండగా, మరికొంత మంది అడ్డుగా ఉన్నారంటూ హత్యలు చేస్తున్నారు.తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఓ ఘటనే జరిగింది.
చిక్కబళ్లాపుర గంజిగంటె గ్రామంలో… ఓ మహిళ తన భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చింది.స్పృహ కోల్పోగానే అతడిని చికెన్ బర్నర్ పైన కాల్చి చంపేసింది.
ఇంతటి అమానవీయ ఘటనకు పాల్పడ్డ ఆమే… కేవలం తన భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఇలా చేసింది.అయితే ఇందుకు ఆమె ప్రియుడు కూడా సాయం చేసినట్లు తెలుస్తోంది.
గ్రామానికి చెందిన మెహర్ కొంత కాలంగా తౌసిఫ్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.అయితే భర్త దాదాపయర్ తనకు అడ్డుగా ఉన్నాడని భావించిన మెహర్… ఓ రోజు అతడికి నిద్ర మాత్రలు కలిపిన పాలు ఇచ్చింది.
అతడు స్పృహ కోల్పోగానే ప్రియుడి సాయంతో భర్తను చంపేసింది.ఆపై అతను ఆత్మహత్య చేసుకున్నాడంటూ కథ అల్లింది.కానీ మృతుడి సోదరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ప్రధాన నిందితురాలు అయిన మెహర్ సహా ఆమె ప్రియుడు తౌసిఫ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.తమ సోదరుడితో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చినా అయిపోయేది.
అనవసరంగా ప్రాణాలు తీసిందంటూ మృతుడి సోదరి కన్నీరు మున్నీరు అవుతుంది.