అమ్మాయిలు అన్ని విషయాల్లో ముందువరసలో ఉంటున్నారంటే ఏమో అనుకున్నాం.కానీ ఇలాంటి విషయాల్లో కూడా ముందు ఉన్నారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే.
ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి ప్రేమ పేరుతో మగవాళ్ళకు మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుంది.ఒకరిద్దరిని కాదు ఏకంగా 16 మంది అబ్బాయిలను తన మాయమాటలతో ప్రేమలోకి దించింది.
అందుకు సోషల్ మీడియాను బాగా వాడేసింది.తన మోసమైన మాటలు నమ్మి ఆ అమ్మాయిని ప్రేమించారు.
కొత్తగా వచ్చే డేటింగ్ యాప్స్ ను ఉపయోగించి ఆ అమ్మాయి 16 అబ్బాయిలను మోసం చేసింది.
ఈ మధ్య యువత ఎక్కువగా డేటింగ్ యాప్స్ ను చెక్ చేస్తుంది.
అలాంటి వారిని టార్గెట్ చేసుకుంది ఆ మాయలేడి.తన అందచందాలతో, తియ్యనైన మాటలతో ప్రేమ వల విసిరి 16 మంది అబ్బాయిల దగ్గర డబ్బులు వసూలు చేసి పరారైంది.
ఈ మాయలేడి ముందుగా డేటింగ్ యాప్స్ లో ముఖం కనిపించకుండా ఎక్సపోసింగ్ ఫోటోలు పెడుతూ.తనకు డేటింగ్ అంటే ఇష్టమని.
ఒకసారి కలిసిన తర్వాత నచ్చితే ప్రేమించుకుందామని పెడుతుంది.ఇది చుసిన కుర్రాళ్లు ఆ అమ్మాయికి కనెక్ట్ అవుతున్నారు.
తర్వాత ఆ అమ్మాయి అతనితో నైస్ గా మాట్లాడి.తర్వాత హోటల్ కు రమ్మని పిలుస్తుంది.
ముందుగా ఆ అమ్మాయి తనతో ఫిజికల్ గా మూవ్ అవ్వడం ఇష్టమేనా అని అడుగుతుంది.ఆ అబ్బాయి సరే అనగానే.నేను చాలా కాస్ట్లీ అని ఒక రేట్ చెబుతుంది.అప్పటికే ఆ అమ్మాయి మాయలో పడిన అబ్బాయిలు సరే అని డబ్బులు తీసుకుని హోటల్ కు వెళ్తారు.
అలా వెళ్లిన ఆ అబ్బాయిని ముందుగా బట్టలు విప్పి స్నానము చేసి రమ్మంటుంది.ఆ అబ్బాయి స్నానం చేయడానికి వెళ్లి వచ్చేలోపు ఆ అమ్మాయి డబ్బులు తీసుకుని అక్కడి నుండి చెక్కేస్తుంది.
తాజాగా ఈ లిస్టులో ఆశిష్ అనే కుర్రాడు చేరిపోయాడు.
అతను కూడా హోటల్ కు వెళ్ళాడు.
స్నానము చేయడానికి బాత్ రూమ్ కి వెళ్లి వచ్చేలోపు అతని నగలు, మొబైల్, పర్స్ తీసుకుని పారిపోయింది.బయటకు వచ్చి చూసిన ఆ యువకుడుకు జరిగిందంతా అర్ధమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే హోటల్ లోని సీసీటీవీ ఫుటేజ్ లో ఆమెను గుర్తుపట్టారు.ముంబైలోని అన్ని హోటల్స్ కు కాల్ చేసి ఆ అమ్మాయి మరోసారి ఎవరితోనైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా చెప్పారు.
సరిగ్గా 4 రోజుల తర్వాత మళ్ళీ మరో అబ్బాయితో ఒక హోటల్ కు వచ్చింది.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఆమె దగ్గర నుండి 15 లక్షల డబ్బులు, బంగారు నగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసారు.16 మందిని మోసం చేసి చివరకు జైలు పాలు అయ్యింది.