చనిపోయి రెండు రోజులైనా బెడ్‌పైనే నిద్ర

భర్త చనిపోతే ఆ భార్య పడే మనోవేదన మాటల్లో చెప్పలేనిది.భర్తకంటే ముందు తనకెందుకు చావు రాలేదంటూ ఆమె బోరున విలపించే తీరు అందరినీ కలిచివేస్తుంది.

 Woman Lives With Husband Dead Body For Days-TeluguStop.com

కానీ న్యూఢిల్లీలోని ఓ మహిళ తన భర్త చనిపోయి రెండు రోజులైనా తన కూతురికి కూడా తెలియనివ్వలేదు.ఆమె ఇలా చేయడానికి వెనుక కారణం కూడా ఉంది.

సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతానికి చెందిన జైకుమార్(59) రైల్వేలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.అతడి భార్య మీనా(55) రైల్వే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.

వారికి తొమ్మిదేళ్ల కూతురు ఉంది.తండ్రి అంటే ఎనలేని ప్రేమ ఉన్న తన కూతురికి తండ్రి రెండు రోజులు క్రితం గుండెపోటుతో మరణించిన వార్తను మీనా తెలియనివ్వలేదు.

అంతేగాక తన తండ్రి బెడ్‌రూంలో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పింది.

రెండు రోజులు దాటినా తన తండ్రి బయటకు రాకపోవడంతో కూతురు జైకుమార్‌ను తట్టి లేపబోయింది.

కానీ అతడు ఉలుకుపలుకు లేకుండా ఉండటం, అతడి నోట్లో నుండి రక్తం రావడంతో భయాందోళనకు గురైన ఆ చిన్నారి తన బంధువుకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది.దీంతో సదరు బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

అయితే మీనా వారిని కూడా అడ్డుకుంది.

కానీ ఆమెకు నచ్చజెప్పిన పోలీసులు జైకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అటు మీనా మానసిక పరిస్థితిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.భర్త మృతదేహాన్ని రెండు రోజులుగా ఇంట్లోనే ఉంచుకుని ఎవ్వరికీ ఎందుకు చెప్పలేదనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube