రోజురోజుకూ యువత దారుణంగా ప్రవర్తిస్తున్నారు.వాళ్లకు అడ్డుగా ఉన్నారని తెలిస్తే ఎంతటివారినైనా ఎంత దగ్గరవారినైనా చంపడానికి వెనుకాడడం లేదు.
ప్రేయసి మోసం చేసిందని లేదా ప్రియుడు మోసం చేసాడని ఇలా ప్రతి విషయానికి వాళ్ళను చంపడమో లేదా వీళ్ళే ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు.తాజాగా జరిగిన ఒక సంఘటన ఈ కోవకే వస్తుంది.
ఒక యువతి తనకు కాబోయే భర్తతో కలిసి మాజీ ప్రియుడును దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.పార్టీకి అని పిలిచి తనకు కాబోయే భర్తతో కలిసి తన బాయ్ ఫ్రెండ్ ను దారుణంగా చంపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒక యువతి నితిన్ చౌదరి అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉంది.కొన్ని నెలల క్రితం ఈ యువతి నితిన్ కు బ్రేకప్ చెప్పింది.
అంతేకాదు మరొక వ్యక్తితో పెళ్ళికి కూడా సిద్ధమైంది.ఢిల్లీకి చెందిన కుల్వీందర్ సింగ్ అనే వ్యక్తికి పెళ్లి చేసుకోబోతుంది.
అయితే నితిన్ మాత్రం ఆ యువతినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.నన్ను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతిపై వేధింపులు చేయడం మొదలు పెట్టాడు.దీంతో ఆ వేధింపులు భరించలేక నితిన్ ను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుని ఒక పెద్ద స్కెచ్ వేసింది.
ఇదంతా కాబోయే భర్త కుల్వీందర్ సింగ్ కు చెప్పి అతన్ని ఒప్పించింది.
తర్వాత ఫిబ్రవరి 6 న నితిన్ ను పార్టీకు రావలసిందిగా చెప్పింది.ఇంక పార్టీలో ఆ యువతి కుల్వీందర్, నితిన్ తో కలిసి మధ్య సేవించింది.
తర్వాత ఆ యువతి ప్లాన్ చేసిన ప్రకారం తనకు కాబోయే భర్తతో కలిసి నితిన్ ను హత్య చేసి అక్కడి నుండి పారిపోయారు.
అయితే ఇదంతా జరిగిన నాలుగు రోజుల తర్వాత పార్టీ జరిగిన ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నితిన్ మృతదేహాన్ని గుర్తించారు.
అయితే ఈ ఇంట్లో నితిన్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
వినోద్ ను పోలీసులు ప్రశ్నించగా తనకు ఈ హత్యతో సంభందం ఉన్నట్లు ఒప్పుకున్నాడు.
నిందితుల వివరాలను కూడా పోలీసులకు తెలిపాడు.అయితే ఇంక పరారీలో ఉన్న ఆ యువతి, ఆమెకు కాబోయే భర్త కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు.