ఒక తల్లికి కావాలా పిల్లలు పుట్టడం అనేది సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది.అలాగే అవిభక్త కవలలు కూడా కొన్ని సందర్భాలలో పుడుతూ ఉంటారు.
అయితే అప్పుడప్పుడు కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతూ ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.అందులో ఒకే సారి నలుగురు పిల్లలకి జన్మనివ్వడం కూడా ఒకటి.
అలాగే ఆ మధ్య ఓ పిల్లాడు యాపిల్ పండు అంత బరువుతో పుట్టాడు.డాక్టర్లు ఎంతో శ్రమించి ఆ పిల్లాడిని రక్షించారు.
ఇదిలా ఉంటే తాజాగా చైనాలో మరో అరుదైన సంఘటన జరిగింది.ఒక తల్లికి కవలపిల్లలు పుట్టారు.
అయితే ఆ పిల్లలు ఇద్దరుకి తండ్రి ఒకడు కాకపోవడం విశేషం.ఇద్దరు తండ్రుల కారణంగా ఈ కవలపిల్లలు పుట్టారు.
ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవల కవలలకు జన్మనిచ్చింది.
కవలలు జన్మించిన ఆనందంలో ఉన్న వ్యక్తికి పుట్టిన బిడ్డలిద్దరి రూపురేఖలు వేరుగా ఉండడంతో ఆమె భర్తకి అనుమానం వచ్చింది.దాంతో డిఎన్ఎ టెస్టు కోసం హాస్పిటల్ డాక్టర్లని కోరాడు.
ఈ టెస్టులో ఆ కవలలకి ఇద్దరు తండ్రులు అని తేలింది.దీంతో కోపం పట్టలేక అతను భార్యను నిలదీయగా ఆమె అసలు విషయం చెప్పింది.
ఒక రోజు రాత్రి ఓ పరాయి వ్యక్తితో గడిపినట్లు ఒప్పుకుంది.ఇక డీఎన్ఎ పరీక్ష చేసిన ఫొరెన్సిక్ కేంద్రం డైరెక్టర్ కవలలు వేర్వేరు తండ్రులతో పుట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పాడు.
చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని.ఇంచుమించు చాలా తక్కువ సమయంలో ఒక మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిస్తే ఇలా జరిగే అవకాశం ఉందని తెలియజేసారు.
అయితే అదే సమయంలో మహిళ రెండు అందాలని విడుదల చేస్తే ఇలా జరుగుతుందని కూడా చెప్పారు.అయితే ఇద్దరు తండ్రులకి పుట్టిన కవలలుగా ప్రపంచంలోకి వచ్చిన ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయారు.