అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూస్తూ ఆసుపత్రి పాలైన యువతి... ఎందుకో తెలుసా..

హాలీవుడ్ సినిమాలు ఊహకు అందని విధంగా తీస్తారు.వారు సినిమాలలో ఏవో గ్రాఫిక్స్ పెట్టి సరిపెట్టారు , అందులో హ్యూమన్ ఎమోషన్ లు కూడా గట్టిగానే ఉండేట్లు చూసుకుంటారు.

 Woman Hospitalised After Watching Avengers Endgame-TeluguStop.com

అలా హాలీవుడ్ లో తెరకెక్కించి ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసిన హాలీవుడ్ సినిమాలకు మంచి కలెక్షన్ లు కూడా వస్తాయి.అందుకే టైటానిక్ , అవతార్ లాంటి సినిమాలు అమెరికా అభిమానులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కనెక్ట్ అయ్యారు.

అలా హాలీవుడ్ లో మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన అన్ని సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా అభిమానులు ఉన్నారు.ఇటీవల రిలీజ్ అయిన అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూస్తూ ఒక యువతి ఆసుపత్రి పాలయింది.అసలు విషయానికి వెళ్తే

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన చివరి చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ను అలరిస్తుంది.2008 లో ప్రారంభమైన మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.అయితే ముందు నుండి మర్వెల్ సిరీస్ ని ఫాలో అవుతున్న ప్రేక్షకుల ను మాత్రం అవేంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం కంటతడి పెట్టిస్తోంది.మర్వెల్ సిరీస్ లో చివరి సినిమా కావడం తో చివరి 30 నిమిషాల్లో వచ్చే సిన్ లలో ఉన్న ఎమోషన్ ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, థోర్, హల్క్, బ్లాక్ పాంథర్ ఇలా సూపర్ హీరోలందరినీ ఓ చోట చేర్చి అవెంజర్స్‌గా మూడు సినిమాలను తెరకెక్కించగా చివరి చిత్రంగా అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ను విడుదల చేశారు.ఈ చిత్రంలో తమ అభిమాన నటులు చనిపోతున్నారనో లేదా ఈ సినిమా మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో చివరి చిత్రమనో కానీ ఈ చిత్రం కారణంగా మార్వెల్ అభిమానులు సినిమా చూస్తూ చాలా ఎమోషన్ అయిపోతున్నారు.

చైనాలో ఓ యువతి ఇలానే ఎక్కువగా ఎమోషన్ అయి ఏకంగా ఆసుపత్రి పాలైంది.చిత్రంలో చివరి సీన్లను చూస్తున్న యువతి కంటతడి పెట్టడం మొదలుపెట్టింది.ఏడవడం ఆపకపోవడంతో ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది.దీంతో యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఎక్కువగా ఏడవడం వల్ల ఆమె హైపర్‌వెంటిలేషన్‌కు గురైందని డాక్టర్లు తెలిపారు.యువతికి ఆక్సిజన్ పెట్టడంతో కొంతసేపటికి ఆమె మామూలు స్థితికి వచ్చింది.

ఒక కామిక్ సిరీస్‌కు ఈ తరహాలో అభిమానులు ఉంటారా అని ఎవెంజర్స్ మునుపటి చిత్రాలను చూడని వారు కూడా ఈ సినిమా చూడటం కోసం ఆశక్తి చూపిస్తున్నారు

ఏప్రిల్ 26 న విడుదలైన ఈ చిత్రం అన్ని దేశాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.విడుదలైన 3 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ యు.యస్ డాలర్లను వసూలు చేసింది , అంటే మన కరెన్సీ లో దాదాపు 7,000 కోట్ల రూపాయలు అన్నమాట.ఇటు మన దేశం లో కూడా ఓ పెద్ద భారతీయ చిత్రం రేంజ్ లో వసూళ్లు సాధించింది.3 రోజులలో ఇండియా లో 170 కోట్లకు పైగా వసూళ్లు చేసింది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube