కూతురి జీవితం బాగుండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు.అలాంటిది కూతురు భర్తను చంపడానికి ప్లాన్ చేసింది ఓ అత్త.
అల్లుడిని చంపడానికి ముగ్గురితో 10 లక్ష రూపాయలకు డీల్ కుదుర్చుకుని, ఎంతో చాకచక్యంగా అల్లుడిని చంపించింది.చివరకు పోలీసులకు విషయం తెలియడంతో ఆ అత్త ఊచలు లెక్కపెడుతుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా కి చెందిన కపిల్ పవార్ అనే న్యాయవాది, తన భార్య మమతా పవార్ గత సంవత్సరం క్రితం మరణించింది.దీంతో ఆ అత్త, అల్లుడికి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి.
ఎలాగైనా తన అల్లుడిని అంతమొందించి ఆస్తిని కాపాడుకోవాలని అత్త షిమ్లా పవార్(66) రాహుల్, అన్వర్, హర్ష యాదవ్ అనే ముగ్గురు వ్యక్తులతో కలిసి తన అల్లుడిని చంపడానికి డీల్ కుదుర్చుకుంది.పథకం ప్రకారం ఆ ముగ్గురు వ్యక్తులు కపిల్ పవార్ కు కోడిగుడ్లలో మత్తు మందు కలిపి ఇచ్చారు.
దీంతో అతను స్పృహ తప్పి పడిపోవడం వల్ల బెల్టుతో అతని మెడకు బిగించి,చంపారు.చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకు వెళ్లి ఏతవా జిల్లాలోని డ్రైనేజీ లో పడేశారు.
కపిల్ కనిపించలేదని మిస్సింగ్ కేస్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డ్రైనేజీలు కపిల్ శవాన్ని గుర్తించారు.కపిల్ కనిపించకపోవడానికి ముందు రోజు ఈ ముగ్గురు వ్యక్తులతో కలిసి మాట్లాడినట్లు పోలీసులకు తెలియడంతో పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయట పెట్టారు.
తన అత్త 10 లక్షలకు డీల్ కుదిర్చే తన అల్లుడిని చంపించిన ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.దీంతో తన అత్త, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరొక వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు.