భర్తను జైలు నుంచి రప్పించేందుకు ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

దుర్గా దేవి పోలీస్ స్టేషన్ కు వచ్చింది.తన భర్తను విడిచి పెట్టాలని పోలీసులను అడిగింది.

 Woman High Voltage Drama For Her Husband In Sikandra Police Station Woman, Dram-TeluguStop.com

భర్తను విడిచి పెట్టకపోతే తన మంత్ర శక్తితో అందర్నీ శపిస్తానని బెదిరించింది.దుర్గా దేవి పోలీసు స్టేషన్ కు రావడం ఏమిటి అనుకుంటున్నారేమో.

కానీ నిజంగానే వచ్చింది.అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

బిహార్ రాష్ట్రంలోని జమూయీ జిల్లాకు చెందిన వ్యక్తి కార్తీక్ మాంఝీ తాగుడుకు బానిసగా మారాడు.ఏదో కేసులో అతడిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు.

అతడిని ఎలాగైనా బయటకు తీసుకురావడానికి అతని భార్య సంజూ దేవి చేసిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అసలు ఆమె ఏమీ చేసిందంటే.

ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బియ్య పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సంజూ దేవి… అక్కడ వీరంగం సృష్టించింది.నేను భక్తు రాలిని, నాలో దుర్గా మాత ఉంది.

నా భర్తను కాపాడుకునేందుకు వచ్చా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.తనతో పాటు తెచ్చుకున్న కర్రతో గిమ్మిక్కులు చేయడం ప్రారంభించింది సంజూ దేవి.

బియ్యం గింజలను పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు అక్కడ ఉన్న అందరి తలలపైనా చల్లింది.తన ఆదేశం ప్రకారమే అంతా జరుగుతుందని.

తను చెప్పకపోతే ఏదీ జరగదని చెప్పుకొచ్చింది.మహిళా కానిస్టేబుళ్లు ఆమెను బయటకు తీసుకెళ్లడంతో హై డ్రామాకు కాస్త తెరపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube