సైక్లింగ్ మెషిన్ తో గింజలను పిండి చేస్తున్న మహిళ !

కొందరు వ్యక్తులు ఏదైనా పని చేసేటప్పుడు రెండు విధాలుగా ఆలోచిస్తారు.చేసే పనిలో ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని, మనీ ఆదాను చేయాలని భావిస్తుంటారు.

 Woman Cycling To Grind Flour,bicycle ,grinding Flour, Woman Cycling, Viral Video-TeluguStop.com

అలాంటి ఆలోచనలు అందరికీ రావు.వచ్చినా కొందరు బద్దకంతో వదిలేస్తారు.

మరికొందరూ పట్టు వీడని విక్రమార్కుడిలా పని చేసి చూపిస్తారు.అయితే ఓ మహిళ చేసిన పనికి అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు.

ఇంట్లో వడియాలు, రొట్టెలు, మురుకులు చేసుకోవడానికి ధాన్యపు గింజలను గిర్నికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.గిర్ని దగ్గరికి వెళ్లినా సమయం వృథాతో పాటు మనీ ఖర్చు అవుతుంది.మనీ సేవ్ చేయాలని భావించిన ఓ మహిళ ఇంట్లోనే పిండి పట్టించేలా వినూత్నంగా ఆలోచించింది.ఇంట్లో ఉన్న జిమ్ సైక్లింగ్ మెషిన్ తో సైకిల్ చక్రానికి కంటైనర్ ను బిగించింది.

ధాన్యాలను ఒక గిన్నెలో వేస్తే అవి పిండి అయ్యేలా ఆవిష్కరించింది.సైకిల్ తొక్కేకొద్ది ధాన్యాలు పిండి అయ్యేలా రూపొందించింది.

అలా ఆమె ఇంట్లో కావాల్సిన బియ్యం, గోధుమలు, మినపప్పు వంటి ధాన్యపు గింజలను సైకిల్ తోనే పిండి చేస్తూ వస్తోంది.ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్వీటర్ లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.

నెటిజన్లు ఆరోగ్యంతో పాటు మనీ సేవ్ చేసుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube