పాముకి పాలు పోసి పెంచితే ఏమవుతుంది.విషమే కక్కుతుంది.
ఇండియానాకు చెందిన ఓ మహిళ కుక్కల్ని పెంచుకున్నట్లు పాముల్ని పెంచుకుంటోంది.అయితే చివరికి ఆ పాము కారణంగానే మరణించింది.
ఓ మహిళను కొండచిలువ చుట్టుకోవడంతో ప్రాణాపాయ స్ధితిలో ఉందని ఆక్స్ఫర్డ్ పట్టణం నుంచి ఇండియానా స్టేట్ పోలీసులకు ఓ వ్యక్తి 911కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వైద్యులు అక్కడికి చేరుకుని 8 అడుగుల కొండచిలువ బారి నుంచి ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అవన్నీ విఫలమై ఆమె మరణించింది.
మృతురాలిని లారా హర్స్ట్గా గుర్తించారు.ఆమె ఇంట్లో సుమారు 140 వరకు విష సర్పాలను పోలీసులు గుర్తించారు.ఈ భవంతిని అరుదైన పాములతో పాటు సరీసృపాలను సేకరించేందుకు ఉపయోగిస్తున్నట్లుగా బెంటన్ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది.బుధవారం సాయంత్రం హార్ట్స్ పాములతో ఆడుకుంటున్నట్లు స్థానికులు చెప్పారని పోలీసులు వెల్లడించారు.
కొండచిలువ మెడకు చుట్టుకోవడం వల్ల ఊపిరాడకపోవడం వల్లనే హార్ట్స్ మరణించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థరాణకు వచ్చినప్పటికీ.శుక్రవారం పోస్ట్మార్టం జరిగిన తర్వాత అసలు కారణం తెలిసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.సీనియర్ ట్రూపర్ డిటెక్టివ్ జోష్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలో ఈ కేసు విచారణ జరుగుతుందని ఇండియానా స్టేట్ పోలీసులు తెలిపారు.