నిజంగా విమానం మొదటి సారి ఎక్కినప్పుడు ఆ యాంగ్జైటీ లో ఏమి చేస్తామో అన్న విషయం మనకే అర్ధం కాదు.తొలిసారి ఆ మాత్రం ఎగ్జైట్ మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికీ.
అయితే చైనా లో కూడా ఒక మహిళ కు అలాంటి యాంగ్జైటీ వచ్చిందో లేదంటే ఎదో బస్సు ఎక్కాం అన్న ధ్యాస లో ఉందొ తెలియదు గానీ ఉక్కపోత గా ఉందంటూ విమానం కిటికీ తెరచి పెట్టుకొని కూర్చుంది.అయితే ఆ విమానంలో ఉన్న ఎవరో దీనిని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇది వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే….చైనాలోని గాన్సు నుంచి హుబే ప్రావిన్సులోని వుహాన్కు వెళ్లాల్సిన షియామెన్ ఎయిర్ జెట్ టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉంది.
ఈలోపు విమానంలో కూర్చున్న ఓ మహిళ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటీకిని తెరిచింది.దీంతో విమానం స్టార్ట్ కాకపోవడం తో కారణం ఏమై ఉంటుందా అని సిబ్బంది బుర్ర బద్దలు కొట్టుకున్నారు.
అయితే ఈ లోపు ఒక సిబ్బంది ఎమర్జెన్సీ కిటికీ తెరచి ఉండడం గమించి వెంటనే ఆమె వద్దకు వెళ్లి అడగ్గా సింపుల్ గా ఉక్కపోత గా ఉందంటూ అందుకే గాలికోసం కిటికీని తెరిచానని చెప్పింది.ఆమె సమాధానం తో సిబ్బంది తో పాటు ప్రయాణికులు సైతం అవాక్కయ్యారు.
దీనితో వెంటనే ఈ ఘటనపై అక్కడే ఉన్న పోలీసులకు సమాచారమివ్వగా విమానంలో తనిఖీలు చేశారు.దీంతో గంట ఆలస్యంగా విమానం బయలుదేరింది.అయితే ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.