మనుష్యులు చనిపోతే వారివారి ఆచారాల ప్రకారం మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తుంటారు జనం.అంత్యక్రియలు ముగిసిన తరువాత ఎవ్వరింటికి వారు వెళ్లిపోతుంటారు.
కానీ పాకిస్థాన్లోని కరాచీలో అంత్యక్రియలు జరుగుతుండగా ఎవ్వరూ ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో జనం పరుగులు పెట్టారు.ఇంతకీ అక్కడ ఏం జరిగిందో మేటర్లోకి వెళ్లి తెలుసుకుందాం.
అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను స్థానిక అబ్బాసీ షాహిద్ ఆసుపత్రిలో చేర్పించారు.ఎన్నివిధాలుగా వైద్య సేవలు అందించినా ఆమె ఆరోగ్యం మెరుగు పడలేదు.
దీంతో రషీదా మృతిచెందినట్లు డాక్టర్లు డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు.రషీదా అంత్యక్రియలకు ఏర్పాటు చేయసాగారు ఆమె కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలో మృతదేహానికి చివరిసారి స్నానం చేయిస్తుండగా ఒక్కసారిగా రషీదా లేచి నిలబడింది.దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
అక్కడున్న స్థానికులు మాత్రం భయంతో పరుగులు పెట్టారు.
రషీదా మృతి చెందిందని బాధపడుతున్న కుటుంబ సభ్యులు ఆమె బ్రతకడంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఆమె శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించి తిరిగి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.అంత్యక్రియల సమయంలో శవం లేచి నిలబడిందనే వార్త స్తానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఏదేమైనా ఇలాంటి విడ్డూరాలు పలుమార్లు చోటుచేసుకుని మనల్ని కూడా అవాక్కయ్యేలా చేస్తాయి.