ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మనిషి జీవితాన్ని భయంభయంగా మార్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఏం చేయాలన్న ఎటు వెళ్లాలి అన్న కనీసం తిండి తినాలన్నా కూడా గుండెల్లో ఏదో తెలియని గుబులు.
కనీసం ఎన్నిరోజులు బతుకుతామో కూడా గ్యారెంటీ లేని జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం అందరు.రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ భయం పెరిగిపోతూనే ఉంది.
అయితే తాజాగా జరిగిన ఘటన మనుషుల్లో కరోనా వైరస్ భయం ఎంతలా ఉంది అనే దానికి నిదర్శనం గా మారిపోయింది.ఒక మనిషిని ఎంతగా ఈ వైరస్ కుంగదీస్తుంది తెలిపేందుకు ఈ ఘటన నిలువుటద్దంగా మారింది.
చైనాలోని బీజింగ్లో షిజింగ్ షాన్ వాండా ప్లాజా కు ఓ మహిళ షాపింగ్ చేయడానికి వెళ్లింది.
ఇంతలో ఆమెకు ఒక ఫోన్ వచ్చింది.
ఫోన్ లో మీకు కరోనా పాజిటివ్ అంటూ వైద్యులు తెలిపారు.దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు మహిళ మనస్థాపానికి గురై ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తూ కుప్పకూలిపోయింది.
ఇక సదరు మహిళ ప్రవర్తన చూసి కరోనా వైరస్ సోకిందని అర్థం చేసుకున్నారు షాపింగ్ మాల్ లో ఉన్న ఇతరులు.దీంతో కనీసం ఆ మహిళ ఓదార్చడం పోయి భయంతో పరుగులు తీశారు.