ఒకపక్క ఢిల్లీ లో ఎన్నికల నేపథ్యంలో మంచి బిజీ గా ఉన్న బీజేపీ కి గట్టి ఝలక్ తలిగింది.ఆ పార్టీకి చెందిన నేత రఘునందన్ రావు పై ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది.
సీపీ సజ్జనార్ ను కలిసిన ఆ మహిళ రఘునందన్ పై లైంగిక ఆరోపణలు చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆ మహిళ తన ఫిర్యాదు లో పేర్కొంది.అంతేకాకుండా కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను భయపెట్టి లొంగదీసుకుంటాడని ఆరోపించారు.
వారికి మత్తు మందు ఇచ్చి టాలీవుట్ హీరోలు, రాజకీయ నాయకుల వద్దకు పంపిస్తారని వారితో బ్లూ ఫిలింస్ తీస్తారంటూ సంచలన ఆరోపణలు చేసింది.అంతేకాకుండా ఒక ప్రముఖ హీరో తమ్ముడికి రఘునందనే మహిళలను సరఫరా చేస్తాడంటూ ఆరోపించింది.
తన భర్త, రఘునందన్ కలిసి కలిడ్నాప్ చేసి తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు.వీరికి డ్రగ్స్ బిజినెస్ కూడా ఉందని ఆమె చెప్పారు.
సోమాజి గూడ లో మీడియాతో మాట్లాడిన ఆమె.రఘునందన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.తన భర్తతో విభేదాల కారణంగా 2003లో స్థానిక పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశానని.న్యాయవాది రఘునందన్ సలహా మేరకు తన భర్తపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు.
అయితే 2007లో కేసు నిమిత్తం రఘునందన్రావు తనను కార్యాలయానికి రావాలి అని పిలవడం తో అక్కడకి వెళ్లగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపించింది.