దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కారణంగా మద్యం షాపులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేశారు.
దీంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఓ మహిళ మద్యం దొరక్క కోమాలోకి వెళ్లిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక స్థానిక జిల్లాకి చెందినటువంటి ఓ మహిళ రోజు కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేది.అయితే ఈమె నిత్యం పని చేస్తున్న కారణంగా ఒళ్ళు నొప్పులు తట్టుకోలేక తరచూ మద్యం సేవిస్తూ ఉండేది.
అయితే ప్రస్తుతం గత 15 రోజులుగా రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేశారు.దీంతో ఎక్కడ మద్యం దొరకడం లేదు.ఈ కారణంగా మహిళ విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తించడం మొదలైంది.అయితే తాజాగా ఈ మహిళ కోమాలోకి వెళ్ళింది.
అయితే ఇలా మద్యం దొరక్క దేశంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.అంతేగాక మరికొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.దీంతో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రతిరోజు లో కొంత సమయం పాటు మద్యం దుకాణాలను తెరిచి మద్యం విక్రయాలను చేపట్టాలని యోచన చేస్తున్నాయి.