చాలామంది భర్తలకు ఉన్నట్టే అతిపెద్ద అనుమానం రోగం అతడిలో దారుణంగా ఉండేది .నిత్యం అనుమానంతో రెప్ప వాల్చకుండా కనిపెడుతున్నా, నిత్యం వేధించినా,ఆ భార్య ఆ భర్తను చాలా కాలం భరించింది.
సహనాన్ని అనుక్షణం చూపించింది .అతడిలో అనుమానం మరింత విస్తరించడంతో ఇక లాభం లేదని ఆమెను ఖతం చేసే ఎత్తులు ఆరంభించాడు .గొడ్డులా పనిచేసే ఆమెను కనికరం లేకుండా చంపడానికి వెనుకాడని భర్తపై విసుగు చెందిన ఆమె రోడ్డుపై శాడిస్ట్ భర్తను బంధువులతో కలిసి చితకబాదింది.ఒకదశలో చస్తాడు అనిపించేలా తుక్కుతుక్కుగా చావా చితక్కొట్టింది .అయితే చుట్టుప్రక్కలవారు ఒక్కరూ కాదనకుండా చోద్యం చూసారు .ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో శనివారం మిట్టమధ్యానం జరిగింది.సర్వాపురం గ్రామానికి చెందిన యాకూబ్కు వరంగల్కు చెందిన షబానతో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు జన్మించారు.అయితే కొన్నేళ్ల నుంచి షబానపై అనుమానం పెంచుకున్న యాకూబ్ నిత్యం శారీరంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.ఇటీవల ఇంట్లోని గ్యాస్ లీక్చేసి హతమార్చడానికి ప్రయత్నించాడని భార్య ఆరోపించింది.
కాగా, రెండు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న యాకూబ్ను నర్సంపేటలోని గెస్ట్హౌస్ వద్ద శనివారం షబాన, ఆమె బంధువులు పట్టుకొని రోడ్డుపై చితక్కొట్టి అడ్డదిడ్డంగా పడేసారు .