ఎన్నికల్లో స్దానికులకే దిక్కులేదు ఎక్కడో దేశం కానీ దేశం నుండి వచ్చి పోటీచేసి అందులో గెలిస్తే మన భారతీయులు ఊరుకుంటారా ఊరుకోరు కదా! మరి ఏం చేశారో తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాక్ కు చెందిన బానో బేగమ్ గడావు అనే మహిళ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించింది.
అయితే ఆమె పుట్టుపుర్వోత్తరాలను బయటకు తీసిన స్దానికులకు ఈ మహిళ పాకిస్దాన్ దేశస్తురాలని తేలిసిందట.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, జలేసర్ పోలీసులు జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ విషయం తెలిసిన బానో బేగం తనను అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోయింది.అలా సుమారుగా నెలన్నర రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట.
చివరికి ఆ మహిళ ఆచూకి కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారట.ఈ విషయాన్ని ఈతాహ్ జిల్లా ఎస్ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ఇకపోతే పాక్ కు చెందిన ఈ మహిళ 1980, జూన్ 8న జిల్లాకు చెందిన అఖ్తర్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చి అప్పటి నుండి తన వీసాను పొడిగించుకుంటూ ఇక్కడే ఉండిపోయిందని పోలీసులు తెలియచేస్తున్నారు.