మరికొద్ది గంటల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ నూతన సీ ఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా తయారైంది.ఈ రోజు మధ్యాహ్నం గం.12:23 నిమిషాలకు ఏపీ సీ ఎం గా జగన్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.జగన్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి తెలంగాణ సీ ఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు.ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానం లో బయలు దేరి 11 గంటల సమయానికి కేసీఆర్ గన్నవరం చేరుకుంటారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ జగన్ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకోనున్నట్లు తెలుస్తుంది.అలానే ఇంకా ఈ కార్యక్రమానికి డీ ఎం కె అధినేత స్టాలిన్,మరికొంత మంది ప్రముఖులు కూడా హాజరవ్వనున్నట్లు తెలుస్తుంది.తన ప్రమాణ స్వీకారానికి రావాల్సింది గా మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు ను జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
అయితే నిన్న జరిగిన టీడీఎల్ఫీ మీటింగ్ లో పలువురు అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం తో ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ తరపున ఎవరూ హాజరు కానున్నట్లు సమాచారం.ప్రమాణస్వీకారానికి ముందే జగన్ ను కలిసి అభినందనలు తెలిపాలని సమావేశంలో నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.