అర్హులైన ఎందరో పేదలు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు కూడా నోచుకోలేదు.జన్మభూమి కమిటీలు చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయినా, ముడుపులు చెల్లించిన ఫలితం దక్కలేదు.
పెళ్లిళ్లు కొత్త జంటలు విడిగా కాపురం ఉంటున్న లక్షలమంది రేషన్ కార్డు కి అప్లై చేసిన తెలుగుదేశం పార్టీ ఆలకించలేదు.రేషన్ కార్డులు ఎలా తగ్గించాలి అనే అంశంపై దృష్టి పెట్టి పేదలకు పెట్టడం పెడదాం అని ఆలోచన చేయలేదు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఎలాంటి కష్టాలు స్వయంగా చూశారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ నవశకం ద్వారా వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు ఆర్థిక పరిమితం పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో , పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేదవాడికి బియ్యం కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకో తీసుకున్నారు.
రేషన్ కార్డు తో ఆరోగ్యశ్రీ కార్డు కు సంబంధం లేకుండా దానికి ప్రత్యేకంగా బియ్యం కార్డు మంజూరు చేశారు.
కులం, మతం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్తి స్థాయి లో కొత్త బియ్యం కార్డులు మంజూరు చేశారు అంతేకాదు అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలించి బియ్యం కార్డు మంజూరు చేసేలా గ్రామ వార్డు, సచివాలయం లో ఏర్పాటు చేశారు.
సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ప్రధానంగా బియ్యం, పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి నిర్మాణ స్థలం మంజూరు నిర్ణీత కాలవ్యవధిలో నిర్ధారించి పక్కాగా అమలు చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అర్హులకు బియ్యం కార్డు మంజూరు చేయాలని నిబంధనలను అమలు చేస్తున్నారు.దీంతో పేదలకు కొత్త బియ్యం కార్డు తో పాటు పెళ్లి తర్వాత వేరు కాపురం ఉంటున్న దంపతులకు సకాలంలో మంజూరు అవుతున్నాయి.
అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు వెంటనే పరిశీలించి బియ్యం కార్డు మంజూరు చేసేలా గ్రామ వార్డు సచివాలయం లో ఏర్పాటు చేశరు.