2019 నవంబర్ మాసంలో చైనా దేశంలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే.గత ఏడాది ఈ వైరస్ దెబ్బకి చాలా దేశాలు ఆర్ధికంగా అదే రీతిలో ప్రాణ నష్టం పరంగా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకున్నయి.
ఇండియాలో కూడా భారీగానే కరోనా తీవ్రత పెరిగిన కానీ సకాలంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వైరస్ పెద్దగా వ్యాప్తి చెందకుండా .ఎఫెక్ట్ చెందకుండా చేశాయి.ఇదిలా ఉంటే దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం పంపిణీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్న తరుణంలో కేసులు ఇటీవల ఉన్నట్టుండి పెరగటంతో కేంద్రం అలర్ట్ అవుతుంది.
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ అదేరీతిలో తాజాగా పూణేలో కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్డౌన్ చేపట్టే ఆలోచనలు చేపట్టడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
దీనిలో భాగంగా పూణేలో ఈరోజు నుండి రాత్రిపూట 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కరుణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను అమలు చేయడానికి రెడీ అయింది.అంత మాత్రమే కాక విద్యాసంస్థల నీ మూసివేస్తూ కూడా అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మరోపక్క మార్చి నెలలో తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.