టీఆర్ఎస్ పార్టీ రద్దుతో తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో ఆయన విఫలం అయ్యారని విమర్శించారు.
అందుకే బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు.
ఏపీలో జగన్ తో మైత్రి కోసం రాయలసీమ ప్రాజెక్ట్ నీటి దోపిడీకి కేసీఆర్ అనుమతి ఇచ్చారని ఆరోపించారు.
అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించి హైదరాబాద్ ను కేసీఆర్ ఫ్రీ జోన్ గా మార్చారని విమర్శించారు.