అమెరికాని మంచు ముంచేస్తోంది.సహజంగా అమెరికాలో మంచు కురవడం జరుగుతూ ఉండే ప్రక్రియే అయినా ఈ మధ్యకాలంలో మంచు ప్రభావం అమెరికాపై తీవ్రంగా చూపుతోంది.
గత నెలలో మంచు ప్రభావంతో ఎక్కడికక్కడ వ్యవస్థ స్తంభించే పరిస్థితికి చేరుకుంది.అయితే తాజాగా మరో సారి మంచు అమెరికాపై ప్రభావం చూపింది.
అమెరికాలో కురుస్తున్న మంచు, ఈదురు గాలుల ప్రభావంతో ఇప్పటికి ముగ్గురు మృతి చెందినట్టుగా అధికారులు దృవీకరించారు.అంతేకాదు ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించి పోయింది.స్కూల్స్ కి , కార్యాలయాలు ఏవీ కూడా పని చేసే పరిస్థితులు లేవు…అన్నిటికి సెలవులు ప్రకటించారు.క్రిస్మస్ పండుగ తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది.
అంతేకాదు దాదాపు 500 విమానాలను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన చేశారు.అమెరికాలోని ప్రధాన రోడ్లు, విమానాశ్ర యాలన్నీ సుమారు 20 నుంచి 30 సెంటిమీటర్ల ఎత్తులో మంచుతో కప్పడంతో.ప్రజలలో ఆందోళన నెలకొంది.అయితే మంచు ప్రభావం తగ్గిన తరువాత అధికారులు చర్యలు చేపడుతామని ప్రకటన చేశారు.
తాజా వార్తలు