పార్లమెంటు శీతాకాల సమావేశాలు దగ్గర పడుతున్నాయి.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇందుకు సంకేతం ఇచ్చారు.
బీహార్ ఎన్నికల చివరి దశ ముగియగానే శీతా కాల సమావేశాల విషయం చర్చిస్తామని చెప్పారు.ఈ నెల 8వ తేదీతో బీహార్ ఎన్నికలు ముగుస్తాయి.
పార్లమెంటులో ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది.దీనిపై ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతారు.
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లు, భూ సేకరణ బిల్లు, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ బిల్లు మొదలైనవి పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది.ఈ బిల్లులు పెండింగులో ఉన్నాయి.
గత సమావేశాల్లో కొన్ని కారణాల వాళ్ళ బిల్లులు ఆమోదం పొందలేదని వెంకయ్య చెప్పారు.ఈ బిల్లులు కాంగ్రెస్ హయాంలో రూపొందినవే అని చెప్పారు.
ఇక పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలు ఆయుధాలు సిద్ధం చేసుకుంటాయి.