మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రం తరువాత తన 152వ చిత్రాన్ని క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పటికే అఫీషియల్గా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఈ సినిమాను అతి త్వరలో సెట్స్పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ను జనవరి 5న ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు.అయితే ఒకే వేదికపై చిరుతో చాలా చిత్రాల్లో నటించి హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్, లేడీ అమితాబ్ విజయశాంతి పంచుకోనున్నారు.
వీరిని ఒకే వేదికపై చూసి చాలా ఏళ్లు కావడంతో ఆ క్షణం కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.ఇటు చిరు 152వ చిత్రంలోనూ విజయశాంతి నటిస్తుందంటూ ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.కొరటాల శివ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించేందుకు విజయశాంతిని కలిశాడని తెలుస్తోంది.
మరి చిరుతో హీరోయిన్గా చేసిన విజయశాంతి ఇప్పుడు మరోసారి కలిసి నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఏదేమైనా వీరిద్దరిని ఒకే స్క్రీన్పై చూస్తే ఆ అనుభూతే వేరంటున్నారు మెగా ఫ్యాన్స్.మరి వారి కోరికను విజయశాంతి తీరుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.