తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొనే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతానికి టిఆర్ఎస్ బిజెపి పార్టీలు మొదటి స్థానంలో ఉన్నాయి.అయితే ఒకప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక జరిగిన అప్పుడు కూడా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గానే జరిగింది.
అయితే దుబ్బాక లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నికలో కూడా నెలకొనడంతో టి ఆర్ ఎస్ వర్సెస్ ఈటెల అనే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ నెల బీజేపీ పార్టీ ఇమేజ్ ను దాటి తన వ్యక్తిగత ఇమేజ్ తోనే హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే హుజరాబాద్ లో బీజేపీకి టిఆర్ఎస్ ఉన్నంతగా అంతగా బలం లేదు.
అందుకే ఈటెల టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎలా ప్రచారం చేశారో ఇప్పుడు కూడా అన్ని వర్గాలను సమీకరిస్తూ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక టి ఆర్ ఎస్ వర్సెస్ ఈటెల గాని సాగనుంది మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.అయితే ఇప్పటికే ఈటెల తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి.ఈటెల ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించినా తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా ఈటెల రాజేందర్ టార్గెట్ గానే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తద్వారా బీజేపీ టార్గెట్ గా కాకుండా టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల గానే రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.