అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణ కాంగ్రెస్ కకావికలమవుతుంది.దీంతో నేతల ఎవరి దారి వారు చూసుకోవడానికి సిద్దమవుతున్నారు.
సీనియర్ నేత, టీపీసీసీ కార్యక్రమ అమలు కమిటీ చైర్పర్సన్ యేలేటి మహేశ్వర్రెడ్డి ఎటువైపు వెళ్తారనే దానిపై తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర గందరగోళం నెలకొంది. త్వరలో ఆయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మహేశ్వర్రెడ్డి ఇటీవలి చర్యలు కూడా రూమర్ కారణమవుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని యేలేటి ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు.
రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి తిరుగుబాటు బావుటా ఎగురవేసి రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీని ఎక్కడికీ తీసుకువెళ్లడం లేదన్నారు.
జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాలు జారీ చేసినా ఆయన కీలక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల హైదరాబాద్లో పార్టీ నేతలకు భారీ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. కుదరని వారు ముందస్తు అనుమతి పొందడం గాని, హాజరుకాలేకపోవడాన్ని ముఖ్య నేతలకు తెలియజేశారు. అయితే యేలేటి ఒక్కరే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన సమావేశానికి గైర్హాజరయ్యారు.
త్వరలో ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. యేలేటి ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారని, ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరే యోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 18 నుంచి ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఏలేటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గణనీయమైన ప్రభావంతో బలమైన నాయకుడుగా ఉన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలు రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిదర్ రెడ్డి, కాషాయ కండువా కప్పుకున్నారు.
దీంతో ఇనాళ్ళ కాంగ్రెస్ అండగా ఉన్నరెడ్డి సామాజిక వర్గం నేతలు ఇప్పుడు బీజేపీ వైపు మళ్ళుతున్నారు.