టీఆర్ఎస్ పార్టీకి ఇది రెండో దఫా ప్రభుత్వం.రెండు ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది.
ప్రతిపక్షాలకు విమర్శల విషయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మాటకు ప్రతి మాట ఇస్తూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడంలో టీఆర్ఎస్ సఫలమైందనే చెప్పవచ్చు.అయితే ఎప్పుడూ మనకు అనుకూల పరిస్థితులు ఎలాగైతే ఉండవో టీఆర్ఎస్ కు కూడా గడ్డు కాలం నడిచిందనే చెప్పవచ్చు.
నిరుద్యోగుల ఆగ్రహం, హైదరాబాద్ వరదలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా టీఆర్ఎస్ ఇచ్చిన ముఖ్య హామీలు నెరవేర్చడంలో విఫలమవడంతో ప్రజల్లో కొంత అగ్రహావేశాలు పెళ్లిబుకాయి.
దాని ఫలితమే దుబ్బాకలో ఓటమి చెందడం, గ్రేటర్ లో అమాంతంగా సీట్లు తగ్గిపోవడం లాంటి పరిణామాలు సంభవించ్చాయి.
అయితే మరల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో టీఆర్ఎస్ లో జోష్ వచ్చిందనే చెప్పవచ్చు.అయితే మరల త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ల హామీ, ఉద్యోగులకు పీఆర్సీ లాంటి హామీల అమలుకు నోచుకుండటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఏర్పడింది.
అయితే ఇప్పుడు మరల పాత టీఆర్ఎస్ ఎలాగైతే విజ్రుంభించిందో అలా మాటలకు పదును పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఈ దూకుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు టీఆర్ఎస్ కొనసాగిస్తుందో లేదో చూడాల్సి ఉంది.