రోజురోజుకూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రజల్లో నమ్మకం కోల్పోతోంది.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ ప్రజల్లో ప్రధాన ప్రతిపక్ష స్థాయి గల పార్టీ స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడటంలో విఫలమవుతూ వస్తోంది.
పార్టీని నడిపించడానికి సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రభుత్వంపై పోరాడే పరిస్థితి కనిపించడం లేదు.అదే విధంగా పార్టీ కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసే బలమైన నాయకత్వం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ప్రజలకు సమస్యల పరిష్కారానికి పోరాడే నాయకుడు కరువవడంతో కాంగ్రెస్ పార్టీ తమ సమస్యల పట్ల పోరాడదనే భావనలో ప్రజలు వస్తున్నట్లు కనిపిస్తోంది.
అంతేకాక క్షేత్ర స్థాయిలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉంటుంటుండడంతో కాంగ్రెస్ నాయకులలో ఐకమత్యం లేదనే భావన ప్రజలలో వ్యక్తమవుతోంది.ఇటువంటి కీలక విషయాలపై కాంగ్రెస్ నాయకత్వం అంత సీరియస్ గా తీసుకోని నే పథ్యంలో కాంగ్రెస పార్టీకి భారీగా నష్టం జరిగేఅవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తోంది.
ఇంకా పీసీసీ చీఫ్ నియామకం అలస్యమవుతున్న నేపథ్యంలో క్యాడర్ కు ఎటువంటి భరోసా ఇస్తారనేది చూడాల్సి ఉంది.అదే విధంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు చేపడితేనే కాంగ్రెస్ క్యాడర్ కు పార్టీ పట్ల నమ్మకం కలుగుతుంది.
.