తాజాగా ప్రభుత్వం పీఆర్సీపై తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున భగ్గుమన్న సంగతి మనకు తెలిసిందే.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసంగా లేదని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ఇప్పటికే ఉద్యోగుల ఆందోళనలపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.ఉద్యోగుల కోరికలు సమంజసమేనని, ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ప్రస్తుతం తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతున్న సందర్భంలో ఉద్యోగుల పీఆర్సీ సమస్యలపై బీజేపీ ఉద్యోగుల పక్షాన నిలబడుతుందా లేక కేసీఆర్ నిర్ణయం కోసం వేచి చూసి ఉద్యోగులతో కలిసి మరొక ఉద్యమానికి బీజేపీ నాయకత్వం వహిస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చగా మారింది.ఇప్పటివరకు ఉద్యోగుల పీఆర్సీ విషయంపై స్పందించని బండి సంజయ్ ఇక ఉద్యోగులు కేసీఆర్ తో భేటీ అయ్యాక జరిగే పరిణామాలపై ప్రతిపక్షాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని బీజేపీ ఈ విషయంపై ఉద్యోగుల పక్షాన గట్టిగా పోరాడే అవకాశం ఉంది.చూద్దాం మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.