సీఎం కుర్చీ టార్గెట్ గానే బండి పాదయాత్ర జరగనున్నదా?

తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్నది.ఇక ఒకటిన్నర రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

 Will The Cart Walk Be The Same As The Cm Chair Target Bjp Party, Bandi Sanjay ,-TeluguStop.com

అయితే ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే పాదయాత్ర చేసారో వారు ముఖ్యమంత్రులుగా అయిన చరిత్ర ఉంది.చంద్రబాబు నాయుడు నుండి మొదలు కొని వై.

ఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఇలా చాలా మంది నాయకులు పాదయాత్ర చేసి అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు.ఆ వ్యూహంలో భాగంగానే బండి సంజయ్ పాదయాత్ర వ్యూహాన్ని ఎంచుకున్నారా అనేది ఇప్పుడు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

అయితే ఈ పాదయాత్రను హుజూరాబాద్ లో ముగించనున్నాడు బండి సంజయ్.

తద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా ప్రజల దృష్టిని బీజేపీ వైపు నిలుపుకునేందుకు బీజేపీ నాయకుల స్ట్రాటజీ బండి సంజయ్ పాదయాత్ర అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే దుబ్బాకలో అనుసరించిన వ్యూహాన్ని అనుసరించకుండా పాదయాత్ర చేపడితే ఇటు పార్టీకి మైలేజ్ మరియు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించినట్లు అవుతుంది అనే కోణంలో ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాలలో మరో సంచలనంగా మారే అవకాశం  కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube