చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి.నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.
ఇక్కడ నుంచి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అనేక పర్యాయాలు.విజయం సాధించి.
మంత్రిగా కూడా చక్రం తిప్పారు.టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ బొజ్జల ఇక్కడ నుంచి విజయం సాధించారు.
పైగా పార్టీని ఇక్కడ బలోపేతం చేశారు.వ్యక్తిగతంగా తాను కూడా ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.2014లో ఆయన మంత్రి పదవిని చేపట్టారు.అయితే.
గత ఏడాది ఎన్నికల్లో అనారోగ్య కారణంగా.గోపాల కృష్ణ పోటీ నుంచి తప్పుకోవడం.
ఆయన కుమారుడు సుధీర్ రంగంలోకి దిగడం తెలిసిందే.
అయితే.
వైసీపీ దూకుడు ముందు.సుధీర్ రాజకీయం తేలిపోయింది.
దీంతో ఆయన ఓడిపోయారు.గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు.
ఈయన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడు.ఆయన టికెట్ ఇప్పించి ప్రోత్సహించి.
రాజకీయాల్లో పైకి తీసుకువచ్చారని.మధు అనేక సందర్భాల్లో వెల్లడించారు కూడా.
అయితే.అనూహ్యంగా ఈ ఇద్దరి మధ్య వివాదాలు, విభేదాలు తెరమీదకి వచ్చాయి.
ఈ క్రమంలో పెద్దిరెడ్డి.వ్యూహం బొజ్జల కుటుంబం వైపు మళ్లిందని ప్రచారం సాగుతోంది.వివాద రహితంగా, పార్టీకి సానుకూలంగా ఉండడం ఈ కుటుంబానికి కలిసివస్తోంది.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి సుధీర్ను వైసీపీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు పెద్దిరెడ్డి వర్గం నుంచి వినిపిస్తున్న టాక్.
సుధీర్ యువ నాయకుడు, వినయ విధేయతలు ఉన్నవాడు కావడం.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ కూడా కావడం కలిసి వస్తున్నాయి.
ప్రస్తుతం పెద్దిరెడ్డి కి అత్యంత సన్నిహితంగా ఉన్న నియోజకవర్గంలోని ఓ నాయకుడు సుధీర్కు రాయబారం పంపారని తెలుస్తోంది.మరోవైపు సుధీర్ కూడా టీడీపీ విషయంలో నిరాసక్తతతో ఉన్నారు.
తమ కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని, తన తండ్రి గోపాలకృష్ణకు కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే మంత్రి పదవిని తీసేశారని ఆయన అసంతృప్తితో ఉన్నారు.ఇక, గత ఏడాది ఓటమి తర్వాత అసలు పట్టించుకోక పోవడం కూడా సుధీర్ను తీవ్రంగా మనస్థాపానికి గురి చేసింది.
దీంతో ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.