తాజాగా నందమూరి బాలకృష్ణ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.
ఇందులో ఇప్పటికే అందాల తార నయనతార ఖరారు కాగా ఈ మధ్యనే తెలుగుభామ అంజలి ని రెండో కథానాయికగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో అప్పట్లో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి బంగారు బుల్లోడు చిత్రంలో “స్వాతిలో ముత్యమంత” అనే వాన పాటని రీమేక్ చేస్తున్నట్లు పలు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.ఈ మధ్యకాలంలో ఈ వార్తలు మరింత ఎక్కువగా అవుతుండటంతో సంగీత దర్శకుడు తమన్ తో కొంతమంది సన్నిహితంగా ఉన్నవారు ఈ విషయం గురించి అడగ్గా లేదని చెప్పినట్లు సమాచారం.
అయితే అప్పట్లో ఈ పాట చిత్రానికి హైలెట్గా నిలిచింది.అంతేగాక ఇప్పటికీ చాలా మందికి ఈ ఇష్టమైన పాటల జాబితాలో ఈ పాట ఉంటుంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అంతేగాక ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కొన్ని సన్నివేశాల్లో ఆఘోర పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి ఇప్పటికే బాలయ్య బాబు వారణాసిలో ఈ చిత్ర షూటింగ్ జరిపేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు కూడా చేస్తున్నారు.